తాజాగా ఒక వ్యక్తి రెండో అంతస్తు పైనుంచి దూకాడు అయినా అతడు ప్రాణాలు దక్కాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే, 2023, సెప్టెంబర్ 26న ముంబైలోని మంత్రాలయ భవనం( Mantralaya Bhavan ) యొక్క రెండవ అంతస్తు నుంచి దూకి ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.మంత్రాలయ అనేది మహారాష్ట్ర( Maharashtra ) ప్రభుత్వ ప్రధాన కార్యాలయం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఆ వ్యక్తి చేతిలో కొన్ని కాగితాలు పట్టుకుని సెకండ్ ఫ్లోర్ క్రింద ఉన్న సేఫ్టీ నెట్పై పాకుతూ ఉన్నట్లు వీడియోలో కనిపించింది.
ఒక పోలీసు అధికారి కూడా నెట్పై కనిపించాడు, ఆ వ్యక్తిని రక్షించడానికి అతని వైపు అధికారి వెళ్ళాడు.

ఆత్మహత్యాయత్నాలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా మంత్రాలయ భవనంలో భద్రతా వలయాలను( Safety Nets ) ఏర్పాటు చేశారు.ఆ వ్యక్తి సేఫ్టీ నెట్స్లో పడిపోయాడని, గాయపడలేదని ముంబై పోలీసులు తెలిపారు.అతడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
గత నెల, ఆనకట్ట ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ మంత్రాలయ భవనం లోపల ఏర్పాటు చేసిన భద్రతా వలయంపైకి నిరసనకారులు కూడా దూకారు.ఈ కేసుకు సంబంధించి 40 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆత్మహత్యాయత్నం ఘటన తర్వాత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే( CM Eknath Shinde ) నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వ పాలనను శివసేన UBT నాయకురాలు ప్రియాంక చతుర్వేది( Priyanka Chaturvedi ) ఖండించారు.ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మహారాష్ట్రలోని అంబజోగై ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు తెలిపారు.టీచర్ల రిక్రూట్మెంట్ చేపట్టాలని అతడు డిమాండ్ చేస్తూ ఈ సూసైడ్ అటెంప్ట్ చేశాడని అనుమానిస్తున్నారు.వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కాగా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్రంలో కొంతకాలంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి.







