ఏపీ హైకోర్టులో ఉండవల్లి రిట్ పిటిషన్ మరో బెంచ్‎కు బదిలీ..!

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రిట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో విచారణ జరపాల్సిన బెంచ్ లోని న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అనడంతో పిటిషన్ మరో బెంచ్ కు బదిలీ అయింది.

 Undavalli's Writ Petition In Ap High Court Transferred To Another Bench..!-TeluguStop.com

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ లో మొత్తం 44 మందిని ఆయన ప్రతివాదులుగా చేర్చారు.

ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ఈడీతో పాటు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ప్రతివాదులుగా చేర్చబడ్డారు.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ ఓ వైపు, అక్రమ కేసు కొట్టివేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టుల్లో విచారణ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube