సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్( Huzur Naga ) పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డుపై ఆగిఉన్న లారీని మంగళవారం కోదాడ నుండి మిర్యాలగూడెం వెళుతున్న ఆర్టీసీ బస్సు( RTC bus ) ఢీ కొట్టడంతో బస్సు డ్రైవర్ తో సహా ఇరవై మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పెనుప్రమాదం తప్పిందని ఘటనా సమయంలో అక్కడే స్థానికులు తెలిపారు.
గాయపడిన వారిని హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు