గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పై రాష్ట్ర హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.పరీక్షల్లో అవకతవకలు జరిగాయని హైకోర్టు సింగిల్ బెంచ్ గ్రూప్ -1 పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది.జూన్ 11వ తేదీన నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిబంధనల మేరకు జరగలేదని, అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోలేదని పలు పిటిషన్లు కోర్టులో దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ పరీక్షను రద్దు చేసింది.ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది.