విజయవాడ ఏసీబీ కోర్టులో రేపు సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లపై విచారణ జరగనుంది.ఏపీ ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి సీఐడీ పీటీ వారెంట్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే టెర్రా సాఫ్ట్ కి అక్రమంగా టెండర్లు ఇచ్చారని సీఐడీ ఆరోపించింది.అందులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిదా పేర్కొంది.సీఐడీ ఆరోపణల ప్రకారం ఫైబర్ నెట్ స్కాం లో రూ.115 కోట్ల నిధులు దోచుకున్నారని సిట్ దర్యాప్తులో తేలిందని సమాచారం.2019లోనే ఫైబర్ నెట్ స్కాంపై కేసు నమోదు కాగా ఇందులో ఏ1గా ఉన్న వేమూరి హరి ప్రసాద్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.