హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ కేసులో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా మరో 14 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించారు.
మాదాపూర్ లోని సర్వీస్ అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ పట్టుబడిన కేసులో ఇప్పటివరకు అధికారులు ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.మరి కొందరు ప్రముఖులు పరారీలో ఉన్నారు.
మరోవైపు పబ్ ఓనర్ సూర్య, నిర్మాత రవి ఉప్పలపాటి, తలహార్ రెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది.అదేవిధంగా హీరో నవదీప్ కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించనున్నారు.
కాగా నవదీప్ ను విచారిస్తే మరి కొంతమంది వినియోగదారుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.







