అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయం

ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అసెంబ్లీ సెషన్స్ కు హాజరుకావాలని టీడీపీ శాసనసభా పక్షం కీలక నిర్ణయం తీసుకుంది.

 The Decision Of The Tdp Legislative Party To Go To The Assembly Meetings-TeluguStop.com

ఇవాళ నిర్వహించిన టీడీపీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ నేత లోకేశ్ మాట్లాడుతూ ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని చెప్పారు.చంద్రబాబు అరెస్టుతో పాటు ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా గళమెత్తాలని పిలుపునిచ్చారు.

ఈ మేరకు అసెంబ్లీలో చేయాల్సిన పోరాటం అసెంబ్లీలోనే చేద్దామని చెప్పారు.అదేవిధంగా వీధుల్లో చేయాల్సిన పోరాటం వీధుల్లోనే చేద్దామని లోకేశ్ తెలిపారు.

ఒకవేళ సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుంటే బయట నిరసన తెలిపాలని పేర్కొన్నారు.ప్రజల్లోకి పార్టీ వాదనను బలంగా తీసుకెళ్లాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube