తెలుగులో బిగ్గెస్ట్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్( Bigg Boss ) ఇప్పటికే ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేస్తుంది.ఇటీవల ఏడవ సీజన్ కూడా ప్రారంభమైంది.
ఈ సీజన్కు సంబంధించి ఆల్రెడీ రెండు వారాల పూర్తయ్యాయి.మొదటి వారంలో ప్రముఖ నటి కిరణ్ రాథోడ్( Kiran Rathod ) ఎలిమినేట్ అయ్యింది.
రెండో వారంలో అడల్ట్ స్టార్ షకీలా( Shakeela ) వెళ్లిపోయింది.ఈసారి హౌస్ లో అడుగు పెట్టింది కేవలం 14 మందే.
అందులో ప్రేక్షకులకు బాగా తెలిసిన ముఖాలు శివాజీ, షకీలా, కిరణ్ రాథోడ్ అని చెప్పవచ్చు.ఈ ముగ్గురు గతంలో సినిమాల ద్వారా ఎంతో అలరించారు.
వీరిని తీసుకురావడంతో చాలామంది ప్రేక్షకులు ఎగ్జైట్ అయ్యారు.మిగతా ఎవరూ తెలియకపోయినా వీరితో ఆట బాగానే ఉంటుందని అనుకున్నారు.
కానీ మొదటి రెండు వారాల్లోనే ముగ్గురిలో ఇద్దరినీ బిగ్ బాస్ యాజమాన్యం ఇంటికి పంపించింది.
పల్లవి ప్రశాంత్,( Pallavi Prashanth ) టేస్టీ తేజ( Tasty Teja ) వంటి వారి గురించి కొంతమంది యూట్యూబ్ యూజర్లకు తప్ప బుల్లితెర ప్రేక్షకులకు తెలిసే చాన్సే ఉండదు.ప్రిన్స్ యావర్,( Prince Yawar ) గౌతమ్ కృష్ణ( Gautam Krishna ) గురించి కూడా పెద్దగా తెలియదు.వారు పెద్దగా ఆట కూడా ఆడటం.
అలాంటి వారిని మాత్రం ఉంచేసుకొని బాగా పాపులర్ అయిన కంటెస్టెంట్స్ ని మాత్రం బిగ్ బాస్ తీసేయడం పట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ ప్రముఖ నటీమణులు కనీసం 10 వారాల వరకైనా ఉంటారని అందరూ భావించారు.
వారందరినీ బిగ్ బాస్ యాజమాన్యం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి.
నిజానికి షకీలా బాగానే ఆట ఆడుతోంది.మిగతా వారి కంటే నిజాయితీగా ఉంటూ కంటెంట్ కోసం కక్కుర్తి పడకుండా ఉంటోంది.అలాంటి షకీలాను ఎందుకు పంపించారు అనేది ప్రశ్నార్థకమే.
ఇక ఓటింగ్ పరంగా కాకుండా వీరిని ముందే పంపించారని కొందరు ఆడియన్స్ ఆరోపణలు కూడా చేస్తున్నారు.ఓట్ల ప్రకారమే ఎలిమినేషన్స్ ఉంటాయని బిగ్ బాస్ చెబుతున్నా అలా జరగదని అంటున్నారు.
వారికి నచ్చిన వారిని, టీఆర్పీ రేటింగ్స్ ఎక్కువ తీసుకొచ్చే వారిని, రెమ్యూనరేషన్ తక్కువ తీసుకునే వారిని మాత్రమే ఎక్కువ హౌస్ లో ఉంచుతారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.మొత్తం మీద స్టార్ యాక్ట్రెస్లను ఎందుకు తీసుకురావడం? ఎందుకు ముందే పంపించేయడం? అని చాలామంది ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.