కాంగ్రెస్ హామీలన్నీ బోగస్..: మంత్రి జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు.ఈ క్రమంలో హస్తం పార్టీ హామీలు అన్నీ బోగస్ అన్నారు.

 All Promises Of Congress Are Bogus..: Minister Jagadish Reddy-TeluguStop.com

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.

ఆచరణకు సాధ్యం కాని హామీలను తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు.తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు.

ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా ఇవ్వని హామీలను కూడా సీఎం కేసీఆర్ నెరవేర్చారని తెలిపారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అయితే హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా వేదికపై నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆరు హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube