హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడు దశవిద్యా మహా గణపతిగా భక్తులకు దర్శనిమస్తున్నారు.దాదాపు 63 అడుగుల ఎత్తులో ఉన్న ఖైరతాబాద్ గణేశునికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలి పూజ నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు.కాగా విఘ్న నాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
అయితే ఈ ఏడాది 63 అడుగుల భారీ ఆకారంతో దశవిద్య మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.గణపతికి కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి, ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బారీకేడ్లు ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది.







