మంత్రి కేటీఆర్ పూర్తిస్థాయిలో హామీలు నెరవేర్చాలి - బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా బిఅర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని,రైతుల అందరికీ ఉచిత ఎరువులు ఇస్తానని, అందరికీ డబుల్ బెడ్ రూమ్ నిర్మిస్తానని, బీసీ బందు అమలు చేస్తానని, అలాగే దళిత బంధు అందరికీ ఇస్తానని చెప్పి ఇంతవరకు హామీలను నెరవేర్చలేదనీ ఎల్లారెడ్డిపేట బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి ఆరోపించారు.బీసీ బందు, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ అర్హులైన వారందరికీ సిరిసిల్ల శాసనసభ్యులు తెలంగాణ మంత్రి కేటీఆర్ పూర్తిస్థాయి ఈ హామీలు నెరవేర్చి ఎల్లారెడ్డిపేట మండలంలో అడుగు పెట్టాలని అన్నారు.

 Minister Ktr Should Fully Fulfill His Promises Bjp Mandal President Ponnala Tiru-TeluguStop.com

లేని పక్షంలో ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారని తిరుపతిరెడ్డి హెచ్చరించారు.ఎన్నికల సమయంలో కొత్త పథకాలు పెట్టడం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం తూతు మంత్రంగా పథకాలు అమలు చేయడం గద్దెనెక్కిన తర్వాత మర్చిపోవడం బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారిపోయిందన్నారు తెలంగాణ ప్రజలను హామీలు ఇచ్చుకుంటూ మోసం చేయడంలో ఈ బిఆర్ఎస్ పార్టీ దిట్ట.

సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు మీ యొక్క అవినీతి గడీల మోసపూరిత పాలనకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube