ఇల్లు కట్టడం చాలా ఖరీదైనది, చిన్న ఇళ్లు కట్టాలన్నా ఈ రోజుల్లో 10 లక్షల పైగానే ఖర్చు అవుతుంది.కష్టపడ్డ సొమ్ముతో పెద్ద పెద్ద భవనాలు నిర్మించినప్పటికీ, వాటి మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చవుతుంది.
ఆ ఖర్చు భరించగలిగే స్తోమత చివరి వరకు ఉండాలి.లేకపోతే దాన్ని అమ్ముకోక తప్పదు.కాగా తాజాగా యునైటెడ్ కింగ్డమ్( United Kingdom )లో, కోటి రూపాయల విలువైన ప్లాట్లను యజమానులు నిర్వహించలేని కారణంగా కేవలం 1 పౌండ్ (సుమారు రూ.100)కి విక్రయించారు.

యూకేలో గృహ సంక్షోభం ఒక ప్రధాన సమస్య.ముఖ్యంగా లండన్, సౌత్ ఈస్ట్లో తగినంత ఇళ్ళు లేవు.ఈ ప్రాంతాలలో ఆస్తి ధరలు, అద్దె రెండూ పెరిగాయి, దీని వల్ల ప్రజలు ఇల్లు కొనడం లేదా అద్దెకు తీసుకోవడం కష్టమవుతుంది.దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న జనాభా.
హౌసింగ్ సంక్షోభానికి ప్రతిస్పందనగా, కార్న్వాల్ కౌన్సిల్( Cornwall Council ) లెవీలోని 11 ప్లాట్లను కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్కు ఊహించనంత ధరకు అమ్మడానికి అంగీకరించింది.ఈ కౌన్సిల్ జస్ట్ 1 పౌండ్ (సుమారు రూ.100)కి వీటిని విక్రయించడానికి అంగీకరించింది.ఎందుకంటే ప్లాట్లను నిర్వహించే స్థోమత కౌన్సిల్కు లేదు.

యూకేలోని కార్న్వాల్ కౌన్సిల్ కూడా 64,000 పౌండ్ల (రూ.6,61,64745) విలువైన గ్రేడ్ II లిస్టెడ్ ఫ్లాట్లను కేవలం 1 పౌండ్ (సుమారు రూ.100)కి విక్రయించాలని నిర్ణయించింది.ఇది పట్టణ కేంద్రంలో సరసమైన గృహాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
సెప్టెంబర్ 13న, లూయిలోని 11 కోస్ట్ గార్డ్ ప్లాట్ల యాజమాన్యాన్ని( Coastguard Flats ) నామమాత్రపు రుసుముతో కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్కు బదిలీ చేయాలనే సిఫార్సును కౌన్సిల్ క్యాబినెట్ ఆమోదించింది.ఈ ప్లాట్ల కమ్యూనిటీ గృహాల కొరత సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.







