హైదరాబాద్ కు కాంగ్రెస్ అగ్రనేతలు.. కాసేపటిలో సీడబ్ల్యూసీ మీటింగ్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు హైదరాబాద్ కు చేరుకున్నారు.ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జునఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ తాజ్ కృష్ణకు చేరుకున్నారు.

 Top Leaders Of Congress To Hyderabad.. Cwc Meeting Soon-TeluguStop.com

కాగా తాజ్ కృష్ణ వేదికగా రెండు రోజులపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పార్టీ అగ్రనేతలతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు హాజరుకానున్నారు.

మరికాసేపటిలో సమావేశాలు ప్రారంభం కానుండగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలే ఎజెండాగా చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.అదేవిధంగా రేపు సీడబ్ల్యూసీ సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది.

ఈ సభా వేదికపై నుంచి సోనియా గాంధీ ఐదు గ్యారెంటీ పథకాలను ప్రకటించనున్నారని ఇప్పటికే పార్టీ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube