కాకినాడ జిల్లా తుని: చంద్రబాబుపై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు.గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేదల అకౌంట్లలో వేయాల్సిన డబ్బును తన సొంత అకౌంట్ కి వేసుకున్నాడు.
అందుకే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊసలు లెక్కపెడుతున్నాడు.ఇంకా రకరకాల స్కాం లు బయటకి వస్తాయి.
తొందరలో ఈఎస్సై స్కాం లో యనమల కూడా ఊసలు లెక్కపెడతారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు అంత దౌర్భాగ్యపు సీఎం ఎవరూ లేరు.
2014, 2019 ఈ రాష్ట్రాన్ని రాక్షసుడిలా చంద్రబాబు దోచుకుతిన్నాడు.రాజధాని, పట్టిసీమ, పోలవరం, స్కిల్ స్కాం అన్నింటిలో తండ్రీ కొడుకులు దోచేశారు.
చంద్రబాబు జైల్లో ఊసలు లెక్కపెడుతున్నా ప్రజలెవరూ అయ్యో పాపం అని కూడా అనడం లేదు.ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్ ని ఇబ్బంది పెట్టిన చంద్రబాబుకి తగిన శాస్తి జరిగిందని ప్రజలు హర్షిస్తున్నారు.
టీడీపీ నేతలు గుండెలు భాదుకుని ప్రజలని రోడ్లు ఎక్కించాలనుకున్నా ఎవరూ రోడ్లు ఎక్కలేదు.







