నరసింహ.( Narasimha ) తెలుగు లో డబ్బింగ్ చేసి విడుదల చేసిన ఈ తమిళ సినిమా అసలు పేరు పడయప్పా.రజినీకాంత్, సౌందర్య( Soundarya ), రమ్య కృష్ణ హీరో హీరోయిన్స్ నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.1999 లో కె ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళలుతో పట్టు తెలుగు లోను ఘన విజయం సాధించింది.హీరోగా రజినీకాంత్ ( Rajinikanth )ఎంతటి పేరు వచ్చిందో విలన్ గా కూడా రమ్య కృష్ణ అంతే మంచి పేరును తీసుకచ్చింది నరసింహ చిత్రం.ఈ సినిమా తర్వాత అంతటి స్థాయిలో రమ్యకృష్ణ కు పేరు తీసుకచ్చిన సినిమా బాహుబలి.
అప్పుడు నీలాంబరిగా ఇప్పుడు శివగామిగా ఆమె నటించిన తీరు అద్భుతం.

ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత చుస్తే మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ సినిమా లెన్త్ వచ్చిందట.అయితే ఈ సినిమాను ఇంత లెన్త్ తో విడుదల చేయడం కష్టం కాబట్టి ఎం చేయాలో పాలుపోక కె ఎస్ రవికుమార్( K.S.Ravikumar ) తర్జన భర్జన పడుతున్నారట.కానీ సినిమా చూస్తే ఎక్కడ కట్ చేసే విధంగా లేకపోవడం తో రజినీకాంత్ నరసింహ చిత్ర దర్శకుడికి ఒక సూచన చేశారట.
సినిమాకు రెండు ఇంటెర్వల్స్ పెట్టాలని అప్పుడే సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా అంత లెన్త్ ఉన్న కూడా చేస్తారని చెప్పారట.అయితే రవి కుమార్ ఎందుకైనా మంచిదని కమల్ హాసన్ కి సినిమా వేసి చూపిస్తే ఎడిట్ చేయాల్సిందే అని.రెండు ఇంటెర్వెల్స్ బాగుండదు అని చెప్పారట.

కమల్ హాసన్ సూచన మేరకు చాల జాగ్రత్తగా సినిమాను ట్రిమ్ చేసి విడుదల చేశారట.సినిమా మంచి విజయం కూడా సాధించింది.కానీ అక్కడితో విషయం పూర్తి కాలేదు.
అప్పట్లో ఫెమస్ మ్యాగ్సైన్ అయినటువంటి కుముదం రెపోర్ట్రర్ కన్నా అనే వ్యక్తి సినిమా ని కట్ చేసిన విషయం తెలిసి రజినీకాంత్ దగ్గరకు వెళ్లి సీక్వెల్ చేయాలనీ చెప్పారట.దాంతో రజినీకాంత్ కూడా ఉన్నపళంగా దర్శకుడిగా ఆ విషయం చెప్పడం తో అయన కట్ చేసిన మిగతా సీన్స్ అన్ని కూడా సినిమా విడుదల జరిగినప్పుడే ధ్వంసం ( Delete ) అయినట్టు గా చెప్పారట.
దాంతో రజిని చేసిన రెండు ఇంటర్వెల్స్ మరియు సీక్వెల్ విషయాలను దర్శకుడు అంత ఈజీ గా ఎలా తోసిపుచ్చారని ఇండస్ట్రీ లో టాక్ నడిచింది.







