సూర్యాపేట జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, విరవనీత చాకలి ఐలమ్మను నేటి సమాజం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని బహుజన్ సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్,ఎమ్మెల్యే అభ్యర్థి పిలుట్ల శ్రీనివాస్ అన్నారు.ఆదివారం పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరీ విముక్తి కోసం విరోచిత పోరాటంలో కుటుంబాని కోల్పోతూ కూడా అలుపెరుగని పోరాటం చేసిన విరవనీత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని అన్నారు.
తెలంగాణ అక్క చెల్లెలు ఆమె స్ఫూర్తిని తీసుకోని బహుజన రాజ్యం కోసం పోరాటం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పిడమర్తి దశరథ,జిల్లా ఈసీ.మెంబర్ మాతంగి ఏసుబాబు,జిల్లా మహిళ నాయకురాలు అంతోటి జ్యోతి,నియోజకవర్గ అధ్యక్షులు కభంపాటి శ్రవణ్,ప్రధాన కార్యదర్శి యరసాని కృష్ణ,కార్యదర్శి మరియు మోతె ఇంచార్జి కాంపాటి వీరస్వామి, నియోజకవర్గం కార్యదర్శి మరియు మునగాల ఇంచార్జి కోట మన్మధుడు, చిలుకూరు మండల అధ్యక్షులు కొండా ఉపేందర్ గౌడ్,అనంతగిరి మండల అధ్యక్షులు నూకల గోపాల్ యాదవ్, కోదాడ మండల అధ్యక్షులు మేరె యల్లారావు,కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ అజార్ బాబా,నియోజకవర్గ నాయకులు నెమ్మది సురేష్,పవన్,గద్దల వీరబాబు,చిట్టిబాబు,షేక్ ఖాసీం,వెంకటేష్,నవీన్, తదితరులు పాల్గొన్నారు.