టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు అల్లు అర్జున్( Allu Arjun ) కు తాజాగా 69వ జాతీయ అవార్డుల ప్రధాన ఉత్సవంలో భాగంగా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు( Best Actor National Award )కు ఎంపికైన విషయం మనకు తెలిసిందే.ఇలా అల్లు అర్జున్ ఈ అవార్డుకు ఎంపిక కావడంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్( Ram Charan ) అభిమానుల మధ్య చిన్నపాటి వార్ జరుగుతుంది.
అయితే రామ్ చరణ్ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఈయన జాతీయ పురస్కారానికి ఎంపిక అయ్యారు కానీ కొందరు రాజకీయాలు చేయడం వల్లే రామ్ చరణ్ ఈ అవార్డులను అందుకోలేకపోయారు అంటూ తాజాగా రాంచరణ్ కి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీ హీరోగా పరిచయమయ్యారు ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన మగధీర ( Magadheera ) సినిమా ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాకి ఏకంగా ఉత్తమ నటుడుగా నంది అవార్డు కోసం చరణ్ పోటీపడ్డాడు.అయితే ఆ సంవత్సరం అనుహికంగా మొత్తం అవార్డులు కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ( Dasari Narayanarao )సొంతం చేసుకున్నారు.
ఇలా మగధీర సినిమాకు ఈయనకు ఆ అవకాశం మిస్ అయింది ఇక రాంచరణ్ నటించిన రంగస్థలం( Rangastalam ) సినిమాకు కూడా జాతీయ ఉత్తమనటుడిగా అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు.

ఇక ఆ ఏడాది మహానటి సినిమా ద్వారా కీర్తి సురేష్( Keerthy Suresh ) ఉత్తమ జాతీయ నటిగా అవార్డు అందుకున్నారు.అలాగే ఆయుష్మాన్ ఖురానా( Ayushman Khurana ) ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.ఇలా రెండోసారి కూడా ఈయనకు ఈ అవార్డు మిస్ అయింది ఇక మూడోసారి త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా కూడా ఉత్తమ జాతీయ నటుడి నామినేషన్ లో ఉన్నప్పటికీ ఈసారి కూడా ఈ అవకాశం అల్లు అర్జున్ వరించడంతో రామ్ చరణ్ ఈసారి కూడా ఈ అవకాశాన్ని కోల్పోయారు.
ఇలా ప్రతిసారి రామ్ చరణ్ నటించిన సినిమాలు నామినేషన్స్ లో ఉన్నప్పటికీ ఈయనకు మాత్రం నిరాశ తప్ప లేదని చెప్పాలి.







