ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైసీపీలో మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.వైసీపీ ఎంపీ బాలశౌరి స్థానిక నేత దుట్టా రామచంద్రరావుతో భేటీ అయ్యారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గెలుపొందిన విషయం తెలిసిందే.ఆ తరువాత ఆయన వైసీపీకి మద్ధతుగా మారారు.
అయితే వల్లభనేని వంశీని మొదటి నుంచి గన్నవరం వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వంశీపై పోటీ చేసి ఓడిపోయిన వారే.
ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి కట్టుగా పని చేశారు.కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ టీడీపీ గూటికి చేరగా దుట్టా రామచంద్రరావు వైసీపీలోనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే దుట్టాను బుజ్జగించేందుకు ఎంపీ బాలశౌరి ప్రయత్నిస్తున్నారు.