తెలంగాణలో దూకుడు పెంచిన కమలం పార్టీ..!

తెలంగాణలో కమలం పార్టీ దూకుడు పెంచింది.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

 Kamalam Party Increased Aggressiveness In Telangana..!-TeluguStop.com

కార్యాచరణను వేగవంతం చేసిన కమలం పార్టీ అగ్ర నాయకత్వం రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది.

ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేలను పంపనుంది.

ఇవాళ్టి నుంచి దాదాపు వారం రోజుల పాటు కేటాయించిన నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే స్థానికంగా పార్టీకి ఉన్న బలాలు, బలహీనతలను తెలుసుకోనున్నారు.ఈ క్రమంలోనే వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి పార్టీ హైకమాండ్ కు నివేదిక అందించనున్నారు.

నియోజకవర్గ పరిస్థితులు,పార్టీ స్థితిగతులపై వివరించనున్నారు.ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సికింద్రాబాద్ లో నిర్వహించిన ఎమ్మెల్యే ప్రవాస్ వర్క్ షాప్ లో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలోనే ఎన్నికల వరకు తరచూ బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube