హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ దగ్గర వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల దీక్షకు దిగారు.ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉండగా పోలీసులు అడ్డుకున్నారు.

 Initiation Of Ys Sharmila At Lotus Pond, Hyderabad-TeluguStop.com

దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైఎస్ షర్మిల తీగుల్ లో ఇటీవల నిరసన చేసిన బాధితులను కలిసేందుకు వెళ్తేందుకు ప్రయత్నించారు.అయితే షర్మల పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు లోటస్ పాండ్ లో భారీగా మోహరించారు.

ఈ క్రమంలోనే షర్మిలను వెళ్లనీయకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు.

దీంతో పోలీసుల తీరుపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రజల తరపున నిలబడిన తమను అడ్డుకోవడం సరికాదన్నారు.పోలీసులు కేసీఆర్ కు తొత్తులుగా పని చేయడం మానేసి ప్రజల కోసం పని చేయాలని తెలిపారు.

గజ్వేల్ లో దళితబంధు పథకం సరిగా అమలు కావడం లేదని ప్రజలు వాపోతుంటే కేసీఆర్ ఎక్కడనున్నారో చెప్పాలన్నారు.ప్రజా సమస్యలపై కేసీఆర్ స్పందించరా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube