రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్టేట్ గో సేవా సమితి చైర్మన్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కొమురవెల్లి దేవేందర్ గుప్తా బుధవారం మాజీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నా జీవితాంతం గో సేవ లో, గో సంరక్షణ లో ఉంటానని.
నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన ఐ వి ఎఫ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐ వి ఎఫ్ కల్చరల్ కమిటీ తెలంగాణ స్టేట్ చైర్మన్ కటకం శ్రీనివాస్, కో చైర్మన్ గుండ శ్రీనివాస్, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ బోనగిరి శ్రీనివాస్ గుప్తా, ఐ వి ఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంబు పాండయ్య గుప్తా తో పాటు తదితరులు పాల్గొన్నారు.







