ఎన్నికలు అయిపోతే కేసీఆర్ ఇళ్లు ఇవ్వరు..: కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమం కొనసాగుతోంది.హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న బీజేపీ మహాధర్నా కేంద్రమంత్రి, రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

 Kcr Will Not Give Houses If Elections Are Over: Kishan Reddy-TeluguStop.com

రాష్ట్రంలో ఉన్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేస్తుంది.అయితే హైదరాబాద్ లో పది లక్షల మంది డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారన్న కిషన్ రెడ్డి ఎన్నికలు అయిపోతే సీఎం ఇళ్లు ఇవ్వరని చెప్పారు.42 బస్తీల్లో శిలాఫలకాలు వేశారన్నారు.డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు.

నాలుగు నెలల తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ హౌజ్ కు వెళ్తుందని జోస్యం చెప్పారు.ఇళ్ల విషయంలో పేదలకు మంచి జరిగేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube