మెహర్ రమేష్ ( Mehar Ramesh ) దర్శకత్వంలో చిరంజీవి( Chiranjeevi ) నటిస్తున్నటువంటి తాజా చిత్రం భోళా శంకర్(Bhola Shankar).ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి తమన్నా ( Thamannah ) జంటగా నటించగా నటి కీర్తి సురేష్ ( Keerthy Suresh ) చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తున్నారు.అదే విధంగా యంగ్ హీరో సుశాంత్ ( Sushanth ) కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారు.
తమిళంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేదాళం సినిమాకు ఈ సినిమా రీమేక్ చిత్రంగా తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను సెలబ్రిటీలు అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే తాజాగా ఈ సినిమా కోసం ఈ స్టార్స్ తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ( Remuneration ) గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ గా మారింది.భోళా శంకర్ సినిమాలో నటించిన నటీనటులు ఎవరెవరు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయానికి వస్తే.
ఈ సినిమా కోసం చిరంజీవి 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు.అయితే ఇప్పటివరకు ఇంకా నిర్మాతల నుంచి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ అందుకోలేదని ఒక సందర్భంలో చిరంజీవి వెల్లడించారు.
ఈ సినిమా విడుదలైన తరువాతనే చిరంజీవి రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది.ఇక హీరోయిన్ గా నటించిన తమన్నా ఈ సినిమా కోసం మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోగా, కీర్తి సురేష్ రెండు కోట్లు కీర్తి సురేష్ కి జోడిగా నటించినటువంటి హీరో సుశాంత్ 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.ఇలా రెమ్యూనరేషన్ల పరంగా ఈ సినిమా కోసం సెలబ్రిటీలో భారీ స్థాయిలోనే తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగానే సేల్ అవుతున్నాయి.