ఏపీలో ఆర్కిటెక్చ్యువల్ బోర్డును ఏర్పాటు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
అభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తాయని తెలిపారు.అదే విధంగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కూడా కేవలం ప్రజా సంక్షేమం దృష్ట్యా రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు చేసిందని పేర్కొన్నారు.
కానీ ఏపీ మాత్రమే అప్పులు చేస్తున్నట్లు అబద్దాలు చెప్తున్నారని మంత్రి బుగ్గన మండిపడ్డారు.ఇప్పటికే ఏపీ అప్పులపై కేంద్రం కీలక ప్రకటన చేసిందన్న మంత్రి బుగ్గన గతంలోని టీడీపీ ప్రభుత్వం కన్నా తక్కువ అప్పే చేశామని వెల్లడించారు.