పెద్దపల్లి జిల్లా రామగుండం బీఆర్ఎస్ పంచాయతీ హైదరాబాద్ కు చేరింది.ఈ క్రమంలో రామగుండం నియోజకవర్గం రెబల్స్ కు మంత్రి కేటీఆర్ నుంచి పిలుపువెళ్లిందని సమాచారం.
అయితే గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు, రెబల్స్ కు మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈక్రమంలోనే ఎమ్మెల్యే కోరుకంటికి మరోసారి టికెట్ ఇవ్వొద్దని రెబల్స్ డిమాండ్ చేస్తున్నారు.
తమలో ఎవరికైనా టికెట్ ఇస్తేనే పార్టీని గెలిపిస్తామని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రెబల్స్ తో సమావేశం కానున్నారని తెలుస్తోంది.







