ఏపీలో అప్పులపై విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు.ఒక్కో ప్రతిపక్ష నేత ఒక్కో రకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.ఈ క్రమంలో రూ.10 లక్షల కోట్లు అని, రూ.7 లక్షల కోట్లని, రూ.11 లక్షల కోట్లు అంటూ ఒక్కొక్కరు ఒక్కో అమౌంట్ ను చెబుతున్నాయన్నారు.ఏపీకి మొత్తం రూ.4.41 లక్షల కోట్ల అప్పు ఉందని పార్లమెంట్ వేదికగా కేంద్రం తెలిపిందని పేర్కొన్నారు.కానీ విపక్షాలు ఆరోపిస్తున్న రూ.10 లక్షల కోట్లు ఎక్కడ అని ప్రశ్నించారు.కావాలనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.గత టీడీపీ ప్రభుత్వం ఇప్పటికంటే ఎక్కువగా అప్పులు చేసిందన్న మంత్రి బుగ్గన వెయ్యి కోట్ల అప్పు అంటూ ఐదుసార్లు రాస్తే రూ.5 వేల కోట్లు అవుతుందా అని నిలదీశారు.
తాజా వార్తలు