పాలనలో వైసీపీ ప్రభుత్వం విఫలం..: చంద్రబాబు

కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా కొండాపురం మండలం బెంజి అనంతపురంలో ఆయన రైతులతో సమావేశం అయ్యారని తెలుస్తోంది.

 Ycp Government Failed In Governance..: Chandrababu-TeluguStop.com

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ గండికోట ఓ చరిత్రాత్మిక కేంద్రమని అన్నారు.రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేశామని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాయలసీమలో ఒక్క ఎకరానికి అయినా నీరు ఇచ్చిందా అని ప్రశ్నించారు.గండికోట నిర్వాసితులకు పరిహారం పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

అవుకు టన్నెల్ ద్వారా నీళ్లు రాకపోతే గండికోటకు నీళ్లు వచ్చేవి కాదన్నారు.రెండవ టన్నెల్ పనులను వైసీపీ ఇంతవరకు మొదలు పెట్టలేదని మండిపడ్డారు.

రాయలసీమకు ఒక స్టీల్ ప్లాంట్ కావాలని మైనింగ్ కార్పోరేషన్ తో జాయింట్ గా పనులకు శంకుస్థాపన చేశానన్నారు.కానీ తన బోర్డులు తీసేసి జగన్ పేరు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube