ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు.
మణిపూర్ ఘటనపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఏడుగురు బీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మాన నోటీసులను ఇచ్చారు.
లోక్ సభలో బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం నోటీసులు దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని బీఆర్ఎస్ విప్ జారీ చేసింది.







