మాజీ మంత్రి కృష్ణ యాదవ్ బీజేపీ గూటికి చేరుకోనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు కృష్ణ యాదవ్ తో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం.
అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్నారని తెలుస్తోంది.అంబర్ పేట్ లేదా మలక్ పేట్ టికెట్ ను కృష్ణ యాదవ్ అడుగుతున్నారని ఇది కన్ఫార్మ్ అయితే ఆయన బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయా పార్టీల్లో చేరికలు జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.







