తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 Tension At Tadipatri Municipal Office-TeluguStop.com

ఈ నిరసనలో జేసీతో పాటు టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.కమిషనర్ ఏకపక్ష ధోరణి నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దాంతో పాటు ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు.కాగా ప్రొటోకాల్ పాటించకుండా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి కమిషనర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ప్రారంభోత్సవానికి ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీ కౌన్సిలర్లను ఆహ్వానించకపోవడంపై నిరసనకు దిగారు.ఈ క్రమంలో ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ సమాధానం చెప్పేంత వరకు ఆందోళన విరమించబోయేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube