రెండో దశ వారాహి విజయ యాత్రలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్( Pawan kalyan ) చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఇంకా కాక రేపుతున్నాయి.ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించే దిశగా ఆలోచన చేస్తూ ఉండగా మరోపక్క పవన్ కళ్యాణ్ పై విజయవాడకు చెందిన వాలంటీర్ విజయవాడ సివిల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు వేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే ఇదే విషయంపై తాజాగా తిరుపతిలో మాట్లాడిన వైసీపీ మంత్రి రోజా( Minister Roja ) కీలక వ్యాఖ్యలు చేశారు.

వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తుంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటూ పవన్ కళ్యాణ్ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.పవన్ కి చిన్న మెదడు చితికిందని.అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇదే సమయంలో చంద్రబాబు( Chandrababu naidu ) పై కూడా విమర్శలు చేశారు.చంద్రబాబుకి వయసు పెరిగే కొద్దీ చాదస్తం ఎక్కువైందని అన్నారు.
చాలామంది వాలంటీర్లుగా పని చేస్తూనే చదువుకుంటున్నారని.పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.







