యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం కోతులాపురం, గుడిమల్కాపురం గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాలు లేక చిన్నారులు ఇబ్బంది పడుతున్నారని, ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని తెలుసుకున్న కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ ముందుకు వచ్చి, ఫౌండేషన్ తరుపున అంగన్వాడీలకు ఊరికి 5లక్షల వ్యయంతో అందంగా అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించి,వాటిపై చిన్నారులకు అవగాహన కోసం బొమ్మలు వేశారు.
ఆడుకునే చిన్నారుల చిత్రాలు తల్లి పాల ప్రాముఖ్యతను తెలుపుతూ గోడలపై ఆకట్టుకున్నాయి,పిల్లలకు ఆట వస్తువులను బహుమానంగా అందించారు.
అన్ని అంగన్వాడీల నిర్మాణం ఫౌండేషన్ తరుపున అందంగా తీర్చిదిద్దితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.ప్రభుత్వానికి కస్తూరి ఫౌండేషన్ చేసే సేవలు గుర్తుకొచ్చి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నారు.







