ఎమర్జింగ్ ఆసియా కప్ లో భారత్ - బంగ్లా క్రికెటర్ల మధ్య గొడవ..!

ఎమర్జింగ్ ఆసియా కప్ ( Emeging Asia Cup ) శ్రీలంక వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే.తాజాగా శుక్రవారం యువ భారత జట్టు- బంగ్లాదేశ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో 51 పరుగుల తేడాతో యువ భారత జట్టు విజయం సాధించింది.

 Heated Argument Between Soumya Sarkar And Harsith Rana In Emeging Asia Cup Match-TeluguStop.com

ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్( Ind vs Pak ) మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.అయితే తాజాగా జరిగిన మ్యాచ్లో భారత్-ఎ, బంగ్లాదేశ్-ఎ ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది.

ప్రస్తుతం ఆ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది.

భారత జట్టు బౌలర్ యువరాజ్ సిన్హ్ దోడియా బౌలింగ్లో బంగ్లా బ్యాటర్ సౌమ్య సర్కార్( Soumya Sarkar ) భారీ షార్ట్ ఆడే ప్రయత్నం చేసి నికిన్ జోస్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.ఆ సందర్భంలో భారత ఆటగాళ్లు కాస్త సందడి చేస్తూ సంబరాలు చేసుకున్నారు.ఇప్పుడు బంగ్లా ఆటగాడైన సౌమ్య సర్కార్ కు.భారత ఆటగాడైన హర్షిత్ రాణా కు ( Harsith Rana ) మధ్య గొడవ జరిగింది.ఇద్దరి మధ్య మామూలుగా మాటకు మాట పెరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

వెంటనే అంపైర్, ఇతర ఆటగాళ్లు కలుగజేసుకొని వెంటనే గొడవను సద్దు మణిగిపించారు.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్- ఎ జట్టు 49.1 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది.అనంతరం లక్ష్య చేదనకు దిగిన బంగ్లాదేశ్- ఎ 34.2 ఓవర్లలో 160 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది.దీంతో భారత జట్టు 51 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది.

ఆదివారం కొలంబో వేదికగా భారత్- పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube