తెలంగాణలో కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి త్వరలోనే ఉమ్మడిగా బస్సు యాత్ర చేయనున్నారని తెలుస్తోంది.ఇవాళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో ముఖ్యనేతలు కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ భేటీలో పార్టీలో చేరికల అంశంతో పాటు కొల్లాపూర్ సభ, కార్యాచరణపై నాయకులు చర్చించారు.అదేవిధంగా ఈనెల 22న పీఏఎసీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
త్వరలోనే ఉమ్మడిగా బస్సు యాత్ర చేయాలని కూడా ఈ సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.







