సాధారణంగా చర్మం పై మొటిమల సమస్యలతో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూనే ఉంటారు.ఆడ, మగ అనే తేడా లేకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు.
అయితే కాలుష్యం, బ్యాక్టీరియా, జిడ్డు చర్మం కారణంగా ముఖంపై మొటిమలు( pimples ) వస్తాయి.అయితే ఈ సమస్య రావడానికి మరో కారణం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
స్నానం చేశాక పళ్ళు తోముకుంటే మొహం పైన మొటిమలు వస్తాయని డెర్మటాలజిస్ట్ చెబుతున్నారు.అయితే ఈ సమస్య నుండి ఎలా తప్పించుకోవాలో అన్నదాన్ని కూడా వారు వివరించారు.
స్నానం చేసిన తర్వాత దంతాలను శుభ్రం చేసుకోవడం వలన చర్మం పై పగుళ్లు ఏర్పడవచ్చు.
![Telugu Tips-Telugu Health Telugu Tips-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2023/07/Dont-make-this-mistake-while-brushing-your-teeth-if-you-do-it-on-your-facea.jpg)
పళ్ళు తోముకునే సమయంలో నోటిలో ఉన్న బ్యాక్టీరియా ( Bacteria )ఇతర ప్రదేశాలకు మారే అవకాశం ఉంటుంది.ప్రధానంగా నోటి చుట్టూ, దవడ వంటి ప్రదేశాల్లో క్రీములు వ్యాపించే అవకాశం ఉంటుంది.చర్మంపై చికాకు కలిగి అందుకే ఆ సమయంలో ఫలితం వలన చర్మంపై చికాకు కలిగి మొటిమలు ఏర్పడతాయి.
దీంతో మృతకణాలు, ఎక్సెస్ ఆయిల్( Dead cells, excess oil ) బ్యాక్టీరియా కాకుండా స్నానం చేశాక దంతాలను శుభ్రం చేసుకున్న కూడా మొటిమలు ఏర్పడతాయి.స్నానానికి ముందే బ్రష్ చేసుకోవడం మంచిది.
ఇక పళ్ళు తోముకున్నాక నోరు బాగా పుక్కిలించాలి.ఇలా చేయడం వలన నోటిలో ఉండే బ్యాక్టీరియా, టూత్ పేస్ట్ అవశేషాలు బయటకు వెళ్లిపోతాయి.
ఫలితంగా చర్మం పైకి బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదం ఉండదు.
![Telugu Tips-Telugu Health Telugu Tips-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2023/07/Dont-make-this-mistake-while-brushing-your-teeth-if-you-do-it-on-your-facec.jpg)
దీంతోపాటు మంచి పరిశుభ్రత అలవాట్లను పాటిస్తే కూడా చర్మ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.అయితే దీనికోసం కొన్ని నియమాలు పాటించాలి.ముఖం కడిగే ముందు చేతులు పరిశుభ్రంగా ఉండేట్లుగా చూసుకోవాలి.
ఏదైనా క్రీమ్ నీ అప్లై చేసే ముందు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.చేతులు శుభ్రంగా చేసుకొని ముఖంపై క్రీమ్ ని అప్లై చేసుకోవాలి.
దీంతో చేతులకు ఉన్న బ్యాక్టీరియా చర్మం పైకి వ్యాపించకుండా ఉంటుంది.అలాగే ముఖంపై పేరుకుపోయిన మురికి నూనె, మలినాలను పోగొట్టాలంటే క్రమం తప్పకుండా మొహాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
అప్పుడే చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది.