ఎర్రి పప్ప అంటూ తణుకు సభలో పవన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

రెండో దశ వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) నేడు తణుకులో ముగిసింది.ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వైసీపీ ప్రభుత్వం పై ముఖ్యమంత్రి జగన్ పై.

 Pawan Kalyan Serious Comments In Tanuku Varahi Sabha Details, Janasena, Pawan Ka-TeluguStop.com

( CM Jagan ) మంత్రులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మరి ముఖ్యంగా తణుకు ఎమ్మెల్యే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు( Karumuri Nageswara Rao ) రైతులను ఉద్దేశించి అప్పట్లో ఎర్రిపప్ప అంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

అన్నం పెట్టే రైతుని ఎర్రి పప్ప అంటూ దాన్ని.కవర్ చేసుకోవడానికి నానా బుజ్జి కన్నా అని అంటారా అంటూ మండిపడ్డారు.అన్నం పెట్టే రైతులను ఏ రకంగా విమర్శిస్తారు అని పవన్ సీరియస్ అయ్యారు.

మీది ఒక ఎర్రిపప్ప ప్రభుత్వం.మంత్రులు కూడా ఎర్రి పప్పలు అంటూ వైసీపీ పై పవన్ ఆగ్రహించారు.అలాగే ఎర్రి పప్ప టాక్స్ లు వేసి ప్రజలను మోసం చేయొద్దు అంటూ జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి.అధికారంలోకి వచ్చాక మాట మార్చారు అని మండిపడ్డారు.మద్యపానం పై దాదాపు లక్ష 30 వేల కోట్లు.ఈ ప్రభుత్వం సంపాదించిందని ఆరోపణలు చేశారు.

ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి తర్వాత వాటిని సమర్ధించుకుంటూ జగన్ హిస్టీరియా రోగంతో బాధపడుతున్నాడు అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube