చంద్రుడిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం కార్యరూపం దాల్చింది.ఈ క్రమంలో చేపట్టిన చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతమైంది.
శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎల్వీఎం-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.దాదాపు 24 రోజులపాటు భూ కక్ష్యలోనే చంద్రయాన్ -3 ప్రవేశించింది.
ఆగస్ట్ 23 లేదా 24 చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్ కానుంది.కాగా ఈ ప్రయోగానికి 25 గంటలకు పైగా గురువారం మధ్యాహ్నం 1.05 కు మొదలు కాగా ఇవాళ మధ్యాహ్నం 2.35 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది చంద్రయాన్-3.చంద్రయాన్ -3 ప్రయోగంతో అన్ని దేశాల వైపు భారత్ వైపే ఉందని చెప్పుకోవచ్చు.అయితే చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి అక్కడ దాగున్న అనేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్-3 ప్రయోగం ప్రధాన లక్ష్యం.







