హైదరాబాద్ లోని దోమలగూడ ఇంటిలో గ్యాస్ లీకైన ఘటనలో మరో ముగ్గురు మృతిచెందారు.ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ముగ్గురు చనిపోయారు.
మృతులు అభి, ధనలక్ష్మీ, నాగమణిగా గుర్తించారు.దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.
మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.అయితే రెండు రోజుల క్రితం దోమలగూడలోని ఓ ఇంటిలో గ్యాస్ లీక్ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.







