తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ విద్యావిధానాన్ని తెలంగాణతో పోల్చడం సరికాదన్నారు.
తెలంగాణలో అంతా చూచిరాతలు, కుంభకోణాలు చూస్తున్నామని తెలిపారు.టీచర్ల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణాది అని విమర్శించారు.
ఈ క్రమంలో మన విధానం మనది, మన ఆలోచనలు మనవి అన్న మంత్రి బొత్స ఏపీ విద్యా వ్యవస్థ ఎంతగానో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు.







