అమరావతి, మూడు రాజధానుల కేసు విచారణ సుప్రీంకోర్టు డిసెంబర్ కు వాయిదా వేసింది.ఆ లోపు కేసు విచారణ సాధ్యం కాదని తెలిపింది.
ఇప్పటికిప్పుడు కేసు విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో నోటీసులు అందని ప్రతివాదులు అందరికీ నోటీసులు పంపాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ ను లీడ్ మ్యాటర్ గా పరిగణించిన న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.అన్ని పిటిషన్లపై పూర్తి విచారణ డిసెంబర్ నెలలో చేపడతామని వెల్లడించింది.