ఆప్ మాజీమంత్రి సత్యేందర్ జైన్ కు మధ్యంతర బెయిల్ పొడిగింపు అయింది.బెయిల్ పొడిగింపు పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం వైద్య కారణాలతో సత్యేందర్ జైన్ కు బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మధ్యంతర బెయిల్ పొడిగింపు కొనసాగుతుందని న్యాయస్థానం వెల్లడించింది.అయితే మనీలాండరింగ్ కేసులో గత ఏడాది సత్యేందర్ జైన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.