కడుపులో మంట, గ్యాస్.స్త్రీ పురుషుడు అనే తేడా లేకుండా కోట్లాది మందిని సర్వసాధారణంగా వేధించే జీర్ణ సంబంధిత సమస్యలు ఇవి.వీటి వల్ల ఏం తినాలన్నా, తాగాలన్నా వెనుకడుగు వేస్తుంటారు.నోరూరించే ఆహారం కళ్ళ ముందు ఉన్నా.
తినలేక మధన పడిపోతుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇకపై చింతించకండి.ఎందుకంటే కడుపులో మంట, గ్యాస్ తదితర జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే సూపర్ డ్రింక్ ఒకటి ఉంది.
ఆ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.
ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ ను తీసుకొని అందులో నాలుగు మిరియాలు, రెండు యాలకులు, అర అంగుళం ఎండిన అల్లం ముక్క వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఫ్రెష్ కొబ్బరి పాలు పోసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు బాయిల్ చేయాలి.
ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి పాలను చల్లార బెట్టుకోవాలి.గోరువెచ్చగా అయిన అనంతరం అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి తో పాటు వన్ టేబుల్ స్పూన్ తాటి బెల్లం పొడిని కూడా వేసి కలిపితే జీర్ణ సమస్యలకు చెక్ పెట్టి సూపర్ డ్రింక్ సిద్ధమయినట్టే.ఈ డ్రింక్ లో రోజుకు ఒక సారి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.
గ్యాస్, కడుపులో మంట, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మలబద్ధకం సమస్య అంటే గనుక.దాని నుంచి సైతం విముక్తి లభిస్తుంది.పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా మారుతుంది.
బాన పొట్ట ఫ్లాట్గా తయారవుతుంది.మరియు ఎముకల బలహీన కూడా దూరం అవుతుంది.