విశ్వాస ఘాతకులు ఎవరు.నమ్మకద్రోహులు ఎవరో చెప్పాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
అద్వానికి ఎవరు ద్రోహం చేశారని ప్రశ్నించారు.పేర్లను మార్చి పథకాలను అమలు చేస్తుంది మీరు కాదా అని నిలదీశారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారా అని అడిగారు.పది సంవత్సరాలలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు కేసీఆర్ ను చూసే పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకుందని తెలిపారు.
బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.







