జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లారు.పవన్ ఏపీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత వారాహి యాత్ర ముగిసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెండో విడత యాత్రపై దృష్టి సారించిన జనసేనాని పార్టీ ముఖ్యనేతలతో ఇవాళ సమావేశం నిర్వహించారు.అయితే రేపు ఏలూరు నుంచి రెండో విడత వారాహి యాత్ర ప్రారంభంకానుంది.
ఈ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్, సభల వివరాలపై చర్చిస్తున్నారు.







