హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గాంధీ భవన్ లో మండల కమిటీల మధ్య వివాదం చెలరేగిందని తెలుస్తోంది.
దీంతో ఆశావాహులు ధర్నాకు దిగారు.మండల కమిటీలలో చోటు దక్కకపోవడంతో అనుచరులతో ఆశావాహులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ నేపథ్యంలో ధర్నా చేస్తున్న వారిని ఆ పార్టీ నేత మల్లు రవి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.