ఏపీ సీఎం జగన్ గృహనిర్మాణ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఇందులో భాగంగా కొత్తగా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పట్టాలు ఇచ్చేందుకు భూములు సేకరించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
భూ సేకరణపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలిపారు.పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డ జగన్ పేదవాళ్ల కడుపు కొట్టడానికి అంతమంది ఏకం అవుతున్నారని విమర్శించారు.
పేదలకు ఇళ్లు రాకూడదన్నది వారి ఆలోచన అన్నారు.అయితే గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని జగన్ సూచించారు.
అందుకోసం న్యాయపరమైన చర్యలన్నీ తీసుకోవాలని వెల్లడించారు.







