జిల్లాలో మంత్రి కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ పర్యటన....

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బిసీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ఈ నెల 6 (గురువారం) న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఈ క్రింది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

 Visit Of Minister Ktr Koppula Eshwar In Rajanna Sircilla District, Minister Ktr-TeluguStop.com

పర్యటన వివరాలు :

ఉదయం 11 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చిన్న తరహా కుటీర వ్యాపారం చేసుకునే 128 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అందజేస్తారు.

ఉదయం 12 గంటలకు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా తంగళ్లపల్లి మండలం, జిల్లెల వ్యవసాయ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పిస్తారు.

ఉదయం 12:30 గంటలకు జిల్లెల్ల వ్యవసాయ కళాశాల ఆవరణంలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 1650 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు.అనంతరం వారితో కలిసి భోజనం చేస్తారు.

మధ్యాహ్నం 3 గంటలకు మనోజ్ తండ్రి ఇటీవల మరణించిన నేపథ్యంలో బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో వారి నివాసానికి వెళ్లి మనోజ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube