1.ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తొలగింపు
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తొలగించారు.ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోము వీర్రాజు( Somu Veerraju ) కు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.
2.చంద్రబాబు పవన్ పై జగన్ కామెంట్స్
టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాన్ రెసిడెన్స్ నాయకులని సీఎం జగన్ విమర్శించారు.
3.కోడి కత్తి కేసు
కోడి కత్తి కేసు పై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది.బెయిల్ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టును అభ్యర్థించగా, ఈ అంశం తమ పరిధిలో లేదని సుప్రీంకోర్టుకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది.
4.బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కు ప్రమాదం
ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
5.వరంగల్ కు ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi )ఈనెల 8న వరంగల్ లో పర్యటించనున్నారు.
6.అధికారులకు జగన్ సూచన
గర్భిణీలకు ఇచ్చే సరుకులు నాణ్యత ఉండాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.మహిళ శిశు సంక్షేమ శాఖ సమీక్షలు జగన్ ఏ వ్యాఖ్యలు చేశారు.
7.బిజెపిపై భట్టి విక్రమార్క విమర్శలు
బిజెపి పని అయిపోయిందని , మాట్లాడేందుకు ఏమీ లేదని సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క అన్నారు.
8.హైదరాబాద్ చేరుకున్న భారత రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది మూర్మూ హైదరాబాద్ కు చేరుకున్నారు.విమానశ్రయంలో గవర్నర్ తమిళ సై సౌందర రాజన్, కేసీఆర్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు ఆమెకు స్వాగతం పలికారు.
9.తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
10.ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారు
కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
11.చిత్తూరు డైరీ పై జగన్ కామెంట్స్
ఒక పథకం ప్రకారం టిడిపి అధినేత చంద్రబాబు చిత్తూరు డైరీ నష్టాల్లోకి నెట్టేసి మూసివేసారని వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ విమర్శించారు.
12.తెనాలిలో రోశయ్య జయంతి వేడుకలు
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శతజయంతి వేడుకలను తెనాలిలో నిర్వహించారు.ఈ సందర్భంగా రోశయ్య గొప్పతనాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు కొనియాడారు.ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
13.రంగ జయంతి పై రాధాకృష్ణ స్పందన
కులమతాలకు అతీతంగా రంగా గారి జయంతి ని నిర్వహిస్తున్నారని రాబోయే రోజుల్లో రంగా అభిమానులు ఐకమత్యం చూపించాలని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు.
14.నేడు ఢిల్లీకి జగన్
వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు.ప్రధాన నరేంద్ర మోడీతో ఆయన ప్రత్యేకంగా భేటీ అవుతారు.
15.రేషన్ షాపుల్లో టమోటా
టమోటాలు ధరలు చుక్కలను రేషన్ షాపుల్లో వాటిని విక్రయించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది.ప్రస్తుతం టమోటో కేజీ150 పలుకుతుండగా, రేషన్ షాపుల్లో 60 కే అందించనున్నారు.
16.నేడు హైదరాబాద్ కు సునీల్ బన్సల్
నేడు హైదరాబాద్కు సునీల్ బాన్సర్ రానున్నారు.పార్టీ నేతలతో ఆయన కీలక భేటీ నిర్వహించను న్నారు.
17.కడియం శ్రీహరి హాట్ కామెంట్స్
మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగరేసి కడియం అని చెప్పండి అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్టేషన్.ఘన్ పూర్ లో ప్రజలను ఉద్దేశించి అన్నారు.
18.కాంగ్రెస్ సభపై గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు
పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఉద్దేశంతో సీఎల్పీ నేత మల్లు బట్ట విక్రమార్క పాదయాత్ర చేసిన ఖమ్మం సభలో ఆయనను పక్కకు నెట్టారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
19.తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి
తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy ) నియమించారు .ఈ మేరకు ఏడు రాష్ట్రాల అధ్యక్షులు మారుస్తూ నూతన అధ్యక్షుల జాబుతాను బిజెపి అధిష్టానం విడుదల చేసింది.