టీడీపీ అధికారంలోకి రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.ఈ క్రమంలో టీడీపీ నేతలు అందరూ ప్రజల్లో ఉండే విధంగా కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు.
భవిష్యత్ కు గ్యారెంటీ అంశాలపై బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు.సీఎం జగన్ అప్పులు తెచ్చి అరకొర సంక్షేమం చేశారన్న ఆయన చంద్రబాబు సంపద సృష్టించి పూర్తి సంక్షేమం చేస్తారని వెల్లడించారు.
దసరాకి విడుదల చేసే మేనిఫెస్టోలో ఉద్యోగుల అంశాలు ఉంటాయని పేర్కొన్నారు.