పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి యాత్రలో భాగంగా మాట్లాడుతున్న మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.తాను హీరో కాకపోయి ఉంటే బలమైన నాయకుడిని అయ్యేవాడినని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను అధికారంలోకి వస్తే ఏపీ భవిష్యత్తును మారుస్తానని పవన్ వెల్లడిస్తున్నారు.ఫ్యాన్స్ తాకిడి నన్ను అడ్డుకుంటోందని పవన్ కామెంట్లు చేశారు.
జన సైనికులు, వీర మహిళలు కచ్చితంగా భద్రతా నియమాలను పాటించాలని పవన్ పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ( Janasena Party ) బలంగా ఉందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.వైసీపీ పాలకులను గద్దె దింపే దిశగా జనసేన అడుగులు వేస్తోందని పవన్ పేర్కొన్నారు.ఈ సమయంలో ఏం చేయడానికైనా వారు సిద్ధపడతారని పవన్ అన్నారు.
అధికారం పోతుందనే ఫీలింగ్ వాళ్లతో ఏమైనా చేయిస్తుందని పవన్ చెప్పుకొచ్చారు.ఎంతకైనా తెగిస్తారు అంటూ పవన్ కళ్యాణ్( Pawan Kalyan Varahi Yatra ) వెల్లడించడం గమనార్హం.
తనను ఎవరైనా భయపెట్టే కొద్దీ రాటుదేలతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.గతంలో జరిగిన దాడులను నేను మరిచిపోనని పవన్ కామెంట్లు చేశారు.సరైన సమాధానం చెప్పే రోజు కచ్చితంగా వస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఉభయ గోదావరి జిల్లాల్లోని ఒక్క స్థానం కూడా వైసీపీ( YCP )కి దక్కకూడదని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.
పవన్ వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని పవన్ కళ్యాణ్ భావిస్తుండగా ఆయన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ పారితోషికం భారీ స్థాయిలో ఉంది.పవన్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.త్వరలో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలతో బిజీ కానున్నారని తెలుస్తోంది.







